చీరాలలో మున్సిపల్ సమావేశం రసాభాస
ABN , First Publish Date - 2022-04-30T19:57:46+05:30 IST
చీరాలలో మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వర్గానికి చెందిన కౌన్సిలర్లు..
బాపట్ల: చీరాలలో మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వర్గానికి చెందిన కౌన్సిలర్లు బాహాబాహీకి దిగారు. ఆమంచి వర్గం కౌన్సిలర్లు పార్టీ గుర్తుపై గెలవలేదంటూ.. తామే వైసీపీ తరపున గెలిచామని కరణం వర్గం కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. ఆమంచి వర్గం కౌన్సిలర్లు చైర్మన్ పోడియం దగ్గర బైఠాయించారు. ఈ క్రమంలోనే చైర్మన్, సభ పట్ల అమర్యాదగా ప్రవర్తించారంటూ.. ఆమంచి వర్గం కౌన్సిలర్లు సత్యనందం, సురేష్పై చైర్మన్ శ్రీనివాసరావు 6 నెలల పాటు సస్పెండ్ చేశారు.