మిత్రులతో కలిసి కార్యక్రమానికి హాజరు.. అనంతరం గ్రామానికి బయలుదేరుతుండగా..

ABN , First Publish Date - 2020-08-03T19:06:32+05:30 IST

మండలంలోని నాగంపేట సమీపంలో ఆదివారం సాయంత్రం కారు బోల్తా..

మిత్రులతో కలిసి కార్యక్రమానికి హాజరు.. అనంతరం గ్రామానికి బయలుదేరుతుండగా..

చీపురుపల్లి(విజయనగరం): మండలంలోని నాగంపేట సమీపంలో ఆదివారం సాయంత్రం కారు బోల్తా పడిన సంఘటనలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పైల పేటకు చెందిన సారిక జగదీష్‌ (24) శ్రీకాకుళం జిల్లా వెంకటాపురంలో జరిగిన ఓకార్యక్రమానికి తన మిత్రులతో కలిసి హాజరయ్యాడు. ఈకార్యక్రమం ముగిశాక తన మిత్రునితో కలిసి కారులో తన గ్రామానికి బయలుదేరాడు. వారు ప్రయాణిస్తున్న కారు నాగంపేట మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో జగదీష్‌ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.  చేతికి అంది వచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెం దడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఎస్‌ఐ ఐ. దుర్గాప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-08-03T19:06:32+05:30 IST