శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు

ABN , First Publish Date - 2021-11-14T21:09:08+05:30 IST

ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు చేశారు. విదేశాల నుంచి తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు

శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు చేశారు. విదేశాల నుంచి తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి ఎయిరిండియా విమానంలో హైదరాబాద్  ఓ ప్రయాణికుడు వచ్చారు. అతని వద్ద 671.9 గ్రాముల అక్రమ బంగారం గుర్తించిన కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితుడు జ్యూసర్‌లో బంగారం దాచి లగేజీ బ్యాగ్‌లో పెట్టుకుని తరలిస్తుండగా అధికారులు చెకింగ్ చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు రూ.34.18 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Updated Date - 2021-11-14T21:09:08+05:30 IST