బొమ్మసముద్రం పీహెచ్సీలో తనిఖీలు
ABN , First Publish Date - 2021-01-19T07:22:36+05:30 IST
బొమ్మసముద్రం పీహెచ్సీని సోమవారం రాష్ట్ర వైద్యాధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గుడిపాల, జనవరి 18: బొమ్మసముద్రం పీహెచ్సీని సోమవారం రాష్ట్ర వైద్యాధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సదుపాయాలు, పరిసరాల్లో పరిశుభ్రత, పచ్చదనంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా తనిఖీ బృందంలోని క్రాంతి ప్రభావతి రెడ్డి, హరికృష్ణ మాట్లాడుతూ.. వైద్యసేవలను మరింత మెరుగుపరచాలని సూచించామన్నారు. కనీసం 70 శాతమైనా రోగులకు మెరుగైన సేవలందిస్తే.. జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాల కింద రూ.3లక్షలు ప్రోత్సాహక నిధులను ప్రభుత్వం అందిస్తుందన్నారు. బొమ్మసముద్రం వైద్యాధికారులు డాక్టర్ వినాయక బాబు, సంధ్య, ఫార్మసిస్ట్ శ్రీధర్రెడ్డి, స్టాఫ్ నర్సు సరస్వతి, మేనక తదితరులు పాల్గొన్నారు.