హస్తవరం సచివాలయం తనిఖీ

ABN , First Publish Date - 2022-05-20T04:52:47+05:30 IST

హస్తవరం సచివాలయాన్ని ఆర్డీఓ కోదండరామిరెడ్డి తహశీల్దారు శిరీషతో కలిసి తనిఖీ చేశారు. రికార్డులను, రిజస్టరును పరిశీలించారు.

హస్తవరం సచివాలయం తనిఖీ
:సచివాలయ రికార్డులను తనిఖీ చేస్తున్న ఆర్డీఓ కోదండరామిరెడ్డి

రాజంపేట టౌన్‌, మే19: హస్తవరం సచివాలయాన్ని ఆర్డీఓ కోదండరామిరెడ్డి తహశీల్దారు శిరీషతో కలిసి తనిఖీ చేశారు. రికార్డులను, రిజస్టరును పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న హౌసింగ్‌, ఓటీఎస్‌, గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాలపై సచివాలయ సిబ్బందితో సమీక్షించారు. ఆర్డీఓ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజల సమస్యలు ఏవైనా వెంటనే వాటి పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలన్నారు.

రైతులు, ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని పరిశీలించి వాటిని వెంటనే పరిష్కరించాలని సూ చించారు. అనంతరం ఆర్డీఓ, తహసీల్దారును సచివాలయ సిబ్బంది సత్కరించారు. కార్యక్రమంలో హస్తవరం సర్పంచ్‌ మహేంద్రరెడ్డి, సచివాలయ వలంటీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T04:52:47+05:30 IST