15ఏళ్లు దాటిన కాలుష్య వాహనాలకు చెక్
ABN , First Publish Date - 2020-09-23T07:35:56+05:30 IST
పదిహేను ఏళ్లు దాటి కాలుష్యాన్ని కక్కుతున్న మోటారు వాహనాలపై కేంద్రం కొరడా ఝళిపించనుంది. ఇక నుంచి ఏ
న్యూఢిల్లీ: పదిహేను ఏళ్లు దాటి కాలుష్యాన్ని కక్కుతున్న మోటారు వాహనాలపై కేంద్రం కొరడా ఝళిపించనుంది. ఇక నుంచి ఏ వాహన యజమాని అయినా 15 ఏళ్లు దాటిన తన వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ను సకాలంలో తీసుకోకపోతే - ఆ వాహన రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్గా రద్దయిపోతుంది.
ఢిల్లీలో మాత్రమే ఈ నిబంధన అమలవుతోంది. పదిహేనేళ్లు దాటిన తన వాహనాన్ని యజమాని ఫిట్నెస్ టెస్ట్కు తీసికెళ్లాలని, కండిషన్ బట్టి మరో ఐదేళ్లు నడపడానికి అనుమతిస్తారని, ఈమేరకు మోటారు వాహన చట్టంలో మార్పులు తెస్తున్నామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ స్పష్టం చేసింది.