ఎస్సీలను మోసం చేయడం దుర్మార్గం

ABN , First Publish Date - 2022-07-02T05:00:44+05:30 IST

ఎస్సీ, ఎస్టీ ఓట్లతో అధికారం చేపట్టి వారికి అన్యాయం చేయడం దుర్మార్గమని కడప నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ అమీర్‌బాబు, టీడీపీ రాష్ట్ర నేతరెడ్యం వెంకటసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు.

ఎస్సీలను మోసం చేయడం దుర్మార్గం
సమావేశంలో మాట్లాడుతున్న అమీర్‌ బాబు

టీడీపీ నేతలు రెడ్యం, అమీర్‌బాబు 

కడప(ఎర్రముక్కపల్లి), జూలై1: ఎస్సీ, ఎస్టీ ఓట్లతో అధికారం చేపట్టి వారికి అన్యాయం చేయడం దుర్మార్గమని కడప నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ అమీర్‌బాబు, టీడీపీ రాష్ట్ర నేతరెడ్యం వెంకటసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీరు ను నిరసిస్తూ టీడీపీ కడప జిల్లా ఎస్సీసెల్‌ ఆధ్వర్యంలో కలెక్టరే ట్‌ వద్ద శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు చేపట్టిన నిరసన దీక్షలో వారు మాట్లాడుతూ వైసీపీ ప్ర భుత్వం ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం చేస్తోందన్నారు.

ప్రజ ల్లో ప్రభుత్వ విశ్వాసం కోల్పోయిందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బుద్ది చెప్పే సమయం అసన్నమైందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. నిసరన దీక్షలో పాల్గొన్న వారికి సంఘీభావం తెలిపి దీక్ష విరమింప జేసి కలెక్టరేట్‌ ఏఓకు టీడీపీ ఎస్సీసెల్‌ నేతలతో కలిసి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వికా్‌సహరికృష్ణ, ఎస్సీ ఎస్టీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T05:00:44+05:30 IST