Charminar: క్రికెట్ బెట్టింగ్ ముఠా సభ్యుల అరెస్ట్
ABN , First Publish Date - 2021-11-01T16:07:03+05:30 IST
ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న రెండు ముఠాలకు చెందిన ముగ్గురిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్కు చెందిన అంకిత్ అగర్వాల్...
హైదరాబాద్/చార్మినార్: ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న రెండు ముఠాలకు చెందిన ముగ్గురిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్కు చెందిన అంకిత్ అగర్వాల్ (31), మోహిత్ అగర్వాల్ (22) అన్నదమ్ములు. వీరు తుకారాంగేట్ ప్రాంతంలో వ్యాపారం చేసేవారు. అధిక సంపాదన కోసం బెట్టింగ్లు నిర్వహిస్తూ పలుమార్లు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. అయినా బెట్టింగ్ నిర్వహణ మారలేదు. నిఘా పెట్టిన టాస్క్ఫోర్స్ పోలీసులు వీరి ఇంటిపై దాడిచేసి బెట్టింగ్ నిర్వహిస్తుండగా అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 65 వేలు, బెట్టింగ్ వివరాలున్న చార్టులను స్వాధీనం చేసుకున్నారు.