భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ Tamilisai
ABN , First Publish Date - 2021-11-04T15:00:46+05:30 IST
ష్ట్ర గవర్నర్ తమిళిసై చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం గవర్నర్కు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. మరోవైపు ఈరోజు ఉదయం బీజేపీ నేత లక్ష్మణ్ అమ్మవారిని దర్శించుకున్నారు. దీపావళిని పురస్కరించుకుని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. అద్భుతమైన అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.