అన్ని దానాలకన్నా అన్నదానం మిన్న

ABN , First Publish Date - 2022-08-14T05:07:18+05:30 IST

అన్ని దానాలకన్నా అన్నదానం మిన్న అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కమలాపు రం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పుత్తా నరసింహారెడ్డి తెలిపారు.

అన్ని దానాలకన్నా అన్నదానం మిన్న

సీకేదిన్నె, ఆగస్టు 13: అన్ని దానాలకన్నా అన్నదానం మిన్న అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కమలాపు రం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పుత్తా నరసింహారెడ్డి తెలిపారు. శ్రావణమాసం మూడవ శనివారం సందర్భంగా కడప నగర శివార్లలోని పాలకొండరాయస్వామి దేవస్థానాన్ని ద ర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఏటూరు రామచంద్రారెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పుత్తా మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారని, అటువంటివారి ఆకలి తీర్చేందుకు అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి గండి ఓబయ్యయాదవ్‌, టీడీపీ కడప పార్లమెంటరీ బీసీసెల్‌ కార్యదర్శి ఇరగనబోయిన హరికృష్ణయాదవ్‌, రవిశంకర్‌యాదవ్‌, రామూనాయక్‌, కన్నయ్య, ఏటూరు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని బయనపల్లె వీరాంజనేయస్వామి ఆలయంలో మూడవ శనివారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. స్థానిక ఏఎల్‌ కాలనీ వద్దగల ఆంజనేయస్వామి గుడి వద్ద ప్రత్యేక పూజలు, చెక్కభజన ఏర్పాటు చేసి భక్తులకు అన్నదానం నిర్వహించారు. మండలంలోని వివిధ ప్రాంతాల్లోని ఆంజనేయస్వామి ఆలయాల్లో మూడవ శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Updated Date - 2022-08-14T05:07:18+05:30 IST