ఏకాంత ంగా రథోత్సవం
ABN , First Publish Date - 2021-05-17T04:59:26+05:30 IST
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన పుష్పగిరిలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం కామాక్షి సమేత వైద్యనాధేశ్వర చెన్నకేశవ రథోత్సవం ఏకాంతంగా నిర్వహించారు.
వల్లూరు, మే 16: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన పుష్పగిరిలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం కామాక్షి సమేత వైద్యనాధేశ్వర చెన్నకేశవ రథోత్సవం ఏకాంతంగా నిర్వహించారు. అంతకు ముందు వేద పండితులు ప్రాతఃకాల ఆరాధనతో విశేష పూజ, మహా నైవేద్యం, మహా మంగళహారతి నిర్వహించారు. యాగశాలలో విశ్వక్సేన ఆరాధన, గణపతిపూజ, పుణ్యహవచనం, నిత్య హోమాలతో పాటు ధన్వంతరి, సుదర్శన, నరసింహ హోమాలను విశేషంగా తెచ్చిన ద్రవ్యాలతో గావించారు. అనంతరం స్వామివారికి రథోత్సవం సందర్భంగా శివపార్వతుల విగ్రహాలను రథంపై, శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవస్వామికి ఆలయంలోనే ఏకాంతంగా ఆస్తానం నిర్వహించారు. కొవిడ్ నేపధ్యంలో భాగంగా రథోత్సవం నిర్వహించలేదు. దిగువ శివాలయంలో కూడా ప్రత్యేక పూజలు, హోమాలను నిర్వహించారు.