ఐఎన్‌ఎక్స్‌ కేసులో చిదంబరం, కార్తిపై చార్జిషీటు

ABN , First Publish Date - 2020-06-03T08:06:17+05:30 IST

ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీ లాండరింగ్‌ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం, ఆయన కుమారుడు కార్తిపై ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు జడ్జి అజయ్‌కుమార్‌ కుహార్‌ ఎదుట సోమవారం ఈడీ అధికారులు ఈ-చార్జిషీటు దాఖలు చేశారు...

ఐఎన్‌ఎక్స్‌ కేసులో చిదంబరం, కార్తిపై చార్జిషీటు

న్యూఢిల్లీ, జూన్‌ 2: ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీ లాండరింగ్‌ కేసులో  కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం, ఆయన కుమారుడు కార్తిపై ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు జడ్జి అజయ్‌కుమార్‌ కుహార్‌ ఎదుట సోమవారం ఈడీ అధికారులు ఈ-చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో ఇతర నిందితులపై కూడా ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. లాక్‌డౌన్‌ ముగిసి తిరిగి కోర్టులో కార్యకలాపాలు ప్రారంభమయ్యాక కాగితాల రూపంలోనూ చార్జిషీటు సమర్పించాలని జడ్జి అధికారులను ఆదేశించారు.  


Updated Date - 2020-06-03T08:06:17+05:30 IST