‘పర్యావరణ’ పరిహారం వసూలు చేయండి

ABN , First Publish Date - 2021-06-23T10:04:07+05:30 IST

పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు నిర్మించినందుకు ఏపీ ప్రభుత్వం నుంచి పర్యావరణ పరిహారం వసూలు చేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ)కి సంయుక్త కమిటీ ప్రతిపాదించింది

‘పర్యావరణ’ పరిహారం వసూలు చేయండి

పురుషోత్తపట్నంపై 2.48కోట్లు, పట్టిసీమపై 1.9 కోట్లు 

ఎన్జీటీకి సంయుక్త కమిటీ సిఫారసులు 


న్యూఢిల్లీ, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు నిర్మించినందుకు ఏపీ ప్రభుత్వం నుంచి పర్యావరణ పరిహారం వసూలు చేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ)కి సంయుక్త కమిటీ ప్రతిపాదించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుపై రూ.2.48కోట్లు, పట్టిసీమపై రూ.1.9 కోట్లు చొప్పున రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి పరిహారాన్ని జమ చేయాలని సిఫారసు చేసింది. మాజీమంత్రి వట్టి వసంత్‌కుమార్‌, జమ్ములయ్య చౌదరి అనే వ్యక్తి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈ రెండు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.   

Updated Date - 2021-06-23T10:04:07+05:30 IST