చన్నీ యూ టర్న్... వ్యాఖ్యలు వక్రీకరించారని విచారం

ABN , First Publish Date - 2022-02-17T21:44:30+05:30 IST

చండీగఢ్: పంజాబ్‌లోకి యూపీ, బీహార్ వాళ్లను రానివ్వబోమని తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని ముఖ్యమంత్రి చన్నీ చెప్పారు.

చన్నీ యూ టర్న్... వ్యాఖ్యలు వక్రీకరించారని విచారం

చండీగఢ్: పంజాబ్‌లోకి యూపీ, బీహార్ వాళ్లను రానివ్వబోమని తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని ముఖ్యమంత్రి చన్నీ చెప్పారు. వాస్తవానికి తాను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఉద్దేశించి మాట్లాడానన్నారు. మరోవైపు చన్నీ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. యూపీలో పుట్టిన సంత్ రవిదాస్‌ను, బీహార్‌లో పుట్టిన గురు గోవింద్ సింగ్‌ను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. చన్నీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా చప్పట్లు కొట్టడాన్ని కూడా ప్రధాని తప్పుబట్టారు. ఇదేనా కాంగ్రెస్ విధానమని ఆయన ప్రశ్నించారు. దీనిపై ప్రియాంక గాంధీ కూడా స్పందించారు. చన్నీ వ్యాఖ్యలను వక్రీకరించారని ఆమె చెప్పారు.

Updated Date - 2022-02-17T21:44:30+05:30 IST