టీటీడీ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు: వైవీ సుబ్బారెడ్డి

ABN , First Publish Date - 2021-10-09T02:35:23+05:30 IST

శ్రీవారి దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులు సులభంగా పొందేలా.. టీటీడీ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

టీటీడీ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు: వైవీ సుబ్బారెడ్డి

తిరుమల: శ్రీవారి దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులు సులభంగా పొందేలా.. టీటీడీ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా దృష్ట్యా టికెట్లన్న ఆన్‌లైన్‌లోనే కేటాయిస్తుండడంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. గత నెలలో జియో యాప్ ద్వారా టికెట్లను విడుదల చేశామని చెప్పారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు సులభంగా టికెట్లు పొందారని పేర్కొన్నారు. టీటీడీ సేవలన్నీ ఒకే యాప్‌లోకి తెచ్చేవిధంగా జియోతో ఎంవోయూ కుదుర్చుకున్నామని తెలిపారు. వైకుంఠ ఏకాదశి నాటికి నూతన యాప్ అందుబాటులోకి వస్తుందని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. 

Updated Date - 2021-10-09T02:35:23+05:30 IST