రాజకీయ లాభం కోసం మార్పు తప్పు: కల్యాణ్‌ రామ్‌

ABN , First Publish Date - 2022-09-23T08:28:25+05:30 IST

రాజకీయ లాభం కోసం మార్పు తప్పు: కల్యాణ్‌ రామ్‌

రాజకీయ లాభం కోసం మార్పు తప్పు: కల్యాణ్‌ రామ్‌

అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరును మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సినీ నటుడు నందమూరి కల్యాణ్‌ రామ్‌ గురువారం ట్విటర్‌లో స్పందించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న ఎన్టీఆర్‌ ఈ మహా విద్యాలయానికి అంకురార్పణ చేశారు. ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ దానికి డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ అని పేరు మార్చారు. ఇప్పుడు ఆ పేరును మార్చడం నాకు బాధ కలిగించింది. కేవలం రాజకీయ లాభం కోసం భావోద్వేగాలతో ముడిపడివున్న ఈ అంశాన్ని వాడుకోవటం తప్పు’’ అని ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2022-09-23T08:28:25+05:30 IST