రోడ్డు ప్రమాదంలో చందూర్ వాసి దుర్మరణం
ABN , First Publish Date - 2021-02-25T04:57:44+05:30 IST
డిచ్పల్లి పోలీసు స్టేషన్ పరిఽధిలోని 44వ జాతీయ రహదారిపై బీబీపూర్ తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చందూరుకు చెందిన సాపాయి శాంతబాయి(49) అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
డిచ్పల్లి, ఫిబ్రవరి24: డిచ్పల్లి పోలీసు స్టేషన్ పరిఽధిలోని 44వ జాతీయ రహదారిపై బీబీపూర్ తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చందూరుకు చెందిన సాపాయి శాంతబాయి(49) అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శాంతబాయి, ఆమె భర్త సాయిలు కొన్ని రోజులుగా బీబీపూర్ తండా శివారులో చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారని గిరిజనులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నమని తెలిపారు. శవాన్ని పోస్ట్మార్టానికి పంపినట్లు తెలిపారు.