చందుపట్ల పీఎసీఏస్ అక్రమాలపై విచారణ
ABN , First Publish Date - 2021-03-05T06:38:30+05:30 IST
నకిలీ రశీదులు ఫైలు చేసిన సీఈ వోపై సస్పన్షన్ వేటు పడడంతో పాటు ఇద్ధరు ఆడిట్ అధికారులు, మాజీ పీఎసీఏస్ చైర్మన్ పై చర్యలకు పాలక వర్గం సిఫారసు చేయడంతో గురువారం భునగిరి మండలం చందుపట్ల పీఎసీఏస్ అవినీతి అక్రమాలపై విచారణ ప్రారంభమైంది.
భువనగిరి రూరల్, మార్చి 3: నకిలీ రశీదులు ఫైలు చేసిన సీఈ వోపై సస్పన్షన్ వేటు పడడంతో పాటు ఇద్ధరు ఆడిట్ అధికారులు, మాజీ పీఎసీఏస్ చైర్మన్ పై చర్యలకు పాలక వర్గం సిఫారసు చేయడంతో గురువారం భునగిరి మండలం చందుపట్ల పీఎసీఏస్ అవినీతి అక్రమాలపై విచారణ ప్రారంభమైంది. పీఎసీఏస్లో జరి గిన అవతవకలపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ అధికారిగా నియామకమైన కోఆపరేటీవ్ అసిస్టెంట్ రిజిస్ర్టార్ జ్యోతిర్మయి విచారణ చేపట్టింది. మండలంలోని చందుపట్ల సొసైటీలో 2013 నుంచి 2020 సంవత్సరానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ చెల్లింపులకు రూ.28,35,705లను సోసైటీ నుంచి ఆన్లైన్లో చెల్లించి నట్టు నఖీలి రశీదులు సొసైటీ రిజిస్ర్టార్లలో నమోదు చేయడంతో జరిగిన అవినీతి అక్రమాలపై సోసైటీ సీఈవో దంతూరి నర్సింహ గౌడ్ పై సస్పెన్షన్ వేటు పడింది. పీఎసీఏస్ మాజీ చైర్మన్, ప్రస్తుత డైరక్టర్ బల్బూరి మధుసూధన్రెడ్డితో పాటు ఆడిటర్లు పి .రాంచందర్రావు, కె.కృష్టయ్యపై విచారణ చేపట్టాలని చైర్మన్ మం దడి లక్ష్మీనర్సింహరెడ్డి డీసీవోకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విచారణాధికారి జోతిర్మయి పీఎసీఏస్ సొసైటీకి సంబంధించిన రిజిష్టర్లు పరిశీలించి, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు నివేదికను సమర్పించినట్టు తెలిపారు.