తూర్పు డీఎ్ఫవోగా చంద్రశేఖర్
ABN , First Publish Date - 2022-05-28T07:01:02+05:30 IST
అటవీ శాఖ తూర్పు విభాగం డీఎ్ఫవోగా చంద్రశేఖర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
చిత్తూరు (సెంట్రల్), మే 27: అటవీ శాఖ తూర్పు విభాగం డీఎ్ఫవోగా చంద్రశేఖర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ డీఎ్ఫవోగా పనిచేస్తున్న నరేంద్రన్ శ్రీకాకుళానికి బదిలీ అయ్యారు. ఆ స్థానానికి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు హోదాలో మెడికల్ లీవులో ఉన్న ఏ.చంద్రశేఖర్ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. చిత్తూరు జిల్లా అటవీ శాఖపై పట్టున్న ఈయన గతంలో టీటీడీ డీఎ్ఫఓగా పనిచేశారు. అనంతపురం, నంద్యాల, కర్నూలు, నిజమాబాద్ డీఎ్ఫవోగానూ పని చేశారు. ఫారెస్ట్ ప్రోటెక్షన్, స్మగ్లింగ్ను అరికట్టడంలో ప్రతిభ కనపరచి ప్రభుత్వం నుంచి అవార్డులు, రివార్డులు, గోల్డ్మెడల్ సాధించారు. జూన్ మొదటి వారంలో విధుల్లో చేరనున్నారు.