చంద్రబాబుది తప్పుడు ప్రచారం: మంత్రి బుగ్గన
ABN , First Publish Date - 2020-06-06T09:58:56+05:30 IST
‘‘ఇళ్ల స్థలాల అంశంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుది తప్పుడు ప్రచారం. వైఎస్ హయాంలో 21 లక్షల ఇళ్లు నిర్మించారు. ఐదేళ్లలో జగన్ సర్కారు 30 లక్షల ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. చంద్రబాబు
అమరావతి, జూన్ 5(ఆంధ్రజ్యోతి): ‘‘ఇళ్ల స్థలాల అంశంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుది తప్పుడు ప్రచారం. వైఎస్ హయాంలో 21 లక్షల ఇళ్లు నిర్మించారు. ఐదేళ్లలో జగన్ సర్కారు 30 లక్షల ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. చంద్రబాబు హయాంలో 6.8 లక్షల గృహాలే నిర్మించారు’’ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అన్నారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో గ్రాఫిక్స్ చూపారన్నారు. ఐదేళ్లలో చంద్రన్న ఫిలిం నడించిందన్నారు. తమ ప్రభుత్వం రూ.80 వేల కోట్లు అప్పుతీసుకుందని యనమల రామకృష్ణుడు అబద్ధాలు చెబుతున్నారని బుగ్గన అన్నారు. అసత్యాలు చెబుతూ ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.