‘చంద్రబాబుని తిడితే వైరస్ పోతుందా?’
ABN , First Publish Date - 2020-04-02T16:14:28+05:30 IST
‘‘ప్రపంచమంతా కరోనా వైరస్తో వణికిపోతుంటే...
కరోనాపై జగన్ నిర్లక్ష్యం: యనమల
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్వర్క్): ‘‘ప్రపంచమంతా కరోనా వైరస్తో వణికిపోతుంటే... రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మాత్రం నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఆయన అలసత్వం, నిర్లక్ష్యం, ఆలోచించని తత్వం రాష్ట్రానికి ఇబ్బందులుగా మారాయి’’ అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆయన బుధవారం ఓ వీడియో ప్రకటన చేశారు. కరోనా విషయంలో మీడియా ద్వారా అన్ని విషయాలను ప్రజలకు చెప్పాలని స్వయంగా ప్రధాని చెప్పినా జగన్ మాత్రం వాస్తవాలు తొక్కిపెట్టేస్తున్నారన్నారు.
చంద్రబాబుని తిడితే వైరస్ పోతుందా?: ఆనందబాబు
‘‘మాజీ సీఎం చంద్రబాబుని విమర్శిస్తూ మంత్రులు వాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరం. ఈ సంక్లిష్ట సమయంలో రాజకీయాలు చేసే దురుద్దేశం టీడీపీకి లేదు. ప్రతిపక్షం సలహాలు, సూచనలు ఇచ్చినప్పుడు ఇష్టమైతే తీసుకోండి... లేకుంటే మానేయండి’’ అంటూ తెలుగుదేశం పార్టీ పదునుగా స్పందించింది. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మీడియాతో మాట్లాడారు. బుధవారం జి.కొండూరు మండలంలో మిర్చి కల్లాలను, మైలవరంలో రైతు బజార్లను, రెడ్డిగూడెం మండలంలో మామిడి తోటలను పరిశీలించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. లాక్డౌన్తో రైతుల పరిస్థితి మరింత దిగజారిందన్నారు. పబ్జీ గేమ్ ఆడుకొంటున్న సీఎం జగన్కు రైతుల్ని పట్టించుకొనే తీరిక లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.