వైసీపీది అధర్మయుద్ధం: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-06-10T02:09:18+05:30 IST

వైసీపీది అధర్మయుద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విలువలున్న పార్టీలా

వైసీపీది అధర్మయుద్ధం: చంద్రబాబు

అమరావతి: వైసీపీది అధర్మయుద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విలువలున్న పార్టీలా వైసీపీ ఎప్పుడూ పోరాడలేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారబట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను నమ్మించడమే వైసీపీ సిద్ధాంతమన్నారు. నాడు అధికారం కోసం తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేశారాని దుయ్యబట్టారు. ఇప్పుడూ అదే పంథాలో వైసీపీ వెళ్తోందని మండిపడ్డారు. వైసీపీ సర్కార్ వైఫల్యాలపై మీడియా, సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఫేక్ పోస్టులతో వైసీపీ గందరగోళం సృష్టిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.

Updated Date - 2022-06-10T02:09:18+05:30 IST