చంద్రబాబు సభలోకి దూసుకువచ్చిన వైసీపీ కార్యకర్త

ABN , First Publish Date - 2022-01-08T01:22:32+05:30 IST

కుప్పం మండలం గరికదిన్నేపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా గరికదిన్నేపల్లి సభను నిర్వహించారు.

చంద్రబాబు సభలోకి దూసుకువచ్చిన వైసీపీ కార్యకర్త

చిత్తూరు: కుప్పం మండలం గరికదిన్నేపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా గరికదిన్నేపల్లి సభను నిర్వహించారు. చంద్రబాబు సభలోకి  వైసీపీ కార్యకర్త దూసుకువచ్చారు. దీంతో బుద్ధి, జ్ఞానం ఉందా అంటూ వైసీపీ కార్యకర్తపై చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ కావాలనే ఇలా నాటకాలు అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభలోకి ఎక్కడైనా టీడీపీ కార్యకర్తలు ఇలా చేసిన సందర్భాలున్నాయా? అని ప్రశ్నించారు. పబ్లిసిటీ చేసుకోవడానికే వైసీపీ ఇలాంటి డ్రామాలు చేస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.


గతంలో చంద్రబాబు కుప్పం పర్యటనలో వైసీపీ కార్యకర్త హల్‌చల్‌ సృష్టించిన విషయం తెలిసిందే. రాళ్లు, కర్రలతో ఓ వైసీపీ కార్యకర్త వచ్చాడు. దీంతో బాంబు తెచ్చారంటూ టీడీపీ కార్యకర్తల ఆందోళన చెందారు. అంతకుముందు చంద్రబాబు కుప్పం పర్యటనకు వస్తే ఆయనపై బాంబు వేస్తాని వైసీపీ నేత సెంధిల్ కుమార్ హెచ్చరించడంతో అందరూ భయపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణుల నినాదాలు చేశాయి. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Updated Date - 2022-01-08T01:22:32+05:30 IST