కులాల మధ్య చిచ్చు పెట్టే చర్యలు మంచిది కాదు: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-01-03T01:44:48+05:30 IST

అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించేలా జరిగిన ఘటనను ఖండిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.

కులాల మధ్య చిచ్చు పెట్టే చర్యలు మంచిది కాదు: చంద్రబాబు

చిత్తూరు: అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించేలా జరిగిన ఘటనను ఖండిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం పక్కనే మరో విగ్రహం పెడతామనడం సరికాదన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం.. ఓ వర్గం ర్యాలీ చేసి ఉద్రిక్తతలు సృష్టించారని తప్పుబట్టారు. పంతం కోసం మరో విగ్రహం పెడతామన్న ఆలోచనను విరమించుకోవాలని ఆయన సూచించారు. దళిత సంఘాలు రోడ్డెక్కే వరకు అధికారులు ఏం చేస్తున్నారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పటికే ఈ అంశంపై వచ్చిన ఫిర్యాదులను పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. కులాల మధ్య చిచ్చు పెట్టే చర్యలు మంచిది కాదన్నారు. దళిత సంఘాల ఆందోళనను ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉయ్యాలవాడ విగ్రహం మరో చోట ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రశాంతమైన కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్తతలు నివారించేలా.. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-01-03T01:44:48+05:30 IST