-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Chandrababu visits Visakha-MRGS-AndhraPradesh
-
chandrababu పర్యటనకు టీడీపీ నాయకులు వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు
ABN , First Publish Date - 2022-05-05T15:57:24+05:30 IST
విశాఖ: నగరంలో పలువురు టీడీపీ నాయకులు, ఎస్సీ సెల్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
Visakha: నగరంలో పలువురు టీడీపీ నాయకులు, ఎస్సీ సెల్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. గురువారం విశాఖ జిల్లాలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అక్కడకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఎందుకు అరెస్టు చేసేది.. కారణాలు చెప్పడం లేదంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో చార్జీల పెంపు, ధరల పెరుగుదలపై తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోరుబాట పట్టారు. విద్యుత్, బస్సు చార్జీల పెంపు, నిత్యావసర వస్తువులు, సిమెంట్ ధరలు పెరుగుదల కారణంగా ప్రజలు ఏ విధంగా ఇబ్బందిపడుతున్నారో స్వయంగా తెలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించారు. ఇందుకోసం పార్టీ రూపొందించిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం నాలుగు గంటలకు విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం తాళ్లవలస గ్రామాన్ని ఆయన సందర్శించనున్నారు. పెరిగిన ధరల వల్ల ప్రజలపై ఎంత భారం పడిందో వివరిస్తూ పార్టీ ముద్రించిన కరపత్రంతో పాటు విసనకర్ర, కొవ్వొత్తి, అగ్గిపెట్టెలను ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబు పర్యటనకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ముఖ్య నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.