చంద్రబాబు పర్యటనను జయప్రదం చేయాలి

ABN , First Publish Date - 2022-05-16T05:18:47+05:30 IST

ప్యాపిలి మండలంలోని జలదుర్గం గ్రామంలో ఈ నెల 19వ తేదీన జరిగే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేద్దామని టీడీపీ డోన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.

చంద్రబాబు పర్యటనను జయప్రదం చేయాలి
డోన్‌లో మాట్లాడుతున్న ధర్మవరం సుబ్బారెడ్డి

డోన్‌, మే 15: ప్యాపిలి మండలంలోని జలదుర్గం గ్రామంలో ఈ నెల 19వ తేదీన జరిగే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేద్దామని టీడీపీ డోన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం పట్టణ, మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నది చంద్రబాబు పర్యటనతో తెలిసిపోయిందన్నారు. అన్ని రకాల ధరలను పెంచేసి ప్రజలను బాధిస్తుండటంతో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, మన్నె గౌతమ్‌రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ప్రజా వైద్యశాల మల్లికార్జున, పార్టీ జిల్లా కార్యదర్శి అభిరెడ్డిపల్లె గోవిందు, తిమ్మయ్య యాదవ్‌, జయన్న యాదవ్‌, కేతపల్లి గుప్త, ఓంప్రకాష్‌, మల్లయ్య, చక్రపాణి గౌడు, తోట మనోహర్‌ బాబు, మర్రి ఉపేంద్ర, మధుసూదన్‌ రెడ్డి, భాష్యం శ్రీధర్‌, గోవింద రెడ్డి, మిద్దెపల్లి గోవిందు అన్వర్‌, రామాంజనేయులు, ఆలిబాబా పాల్గొన్నారు.

బేతంచెర్ల: ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామంలో జరిగే చంద్రబాబు పర్యటనను నాయకులు, కార్యకర్తలు జయప్రదం చేయాలని టీడీపీ డోన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం పార్టీ మండల కన్వీనర్‌ ఎల్లనాగయ్య అధ్యక్షతన నాయకుల, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, టీడీపీ పట్టణ కార్యదర్శి షేక్షావలి చౌదరి, టీడీపీ నాయకులు పోలూరు రాఘవరెడ్డి, తిరుమలేష్‌ చౌదరి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఉన్నం చంద్రశేఖర్‌, పట్టణ బీసీ సెల్‌ అధ్యక్షుడు టైలర్‌ రాముడు, వార్డు కౌన్సిలర్‌ రామాంజినేయులు, హెచ్‌.కొట్టాల టీడీపీ నాయకులు యోగేంద్రబాబు, వెంగన్న, బేతంచెర్ల మధుసూదన్‌శెట్టి, రవీంద్రనాయక్‌, అంబాపురం సర్పంచ్‌ శ్రీనివాసు యాదవ్‌, బుక్కాపురం సర్పంచ్‌ నాగరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.


ప్యాపిలి: మండలంలోని జలదుర్గం గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర గొర్రెలు, మేకల ఫెడరేషన్‌ చైర్మేన్‌ వై.నాగేశ్వరరావుయాదవ్‌ పిలుపునిచ్చారు. ప్యాపిలిలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్‌ హాలులో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. నాయకులు ఆర్‌ఈ రాఘవేంద్ర, గౌతంరెడ్డి,  గండికోట రామసుబ్బయ్య, ఎర్రగుంట్లపల్లి వెంకటేశ్వరరెడ్డి, రామ్మోహన్‌ యాదవ్‌, ప్రసాద్‌రెడ్డి, చల్లా వీరాంజినేయులు, ఎస్‌ మధు, కాంతారెడ్డి, నాగేంద్ర, సుదర్శన్‌, బావిపల్లి ప్రసాద్‌,  ప్రణీత్‌యాదవ్‌, కోదండరాము, కలచట్ల ప్రసాద్‌, గండికోట రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-16T05:18:47+05:30 IST