ప్రజల కష్టం, నష్టం పంచుకోవాలి: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-04-10T21:00:37+05:30 IST

ప్రజల కష్టం, నష్టం పంచుకోవాలి: చంద్రబాబు

ప్రజల కష్టం, నష్టం పంచుకోవాలి: చంద్రబాబు

అమరావతి: ప్రజల కష్టం, నష్టం పంచుకోవాలని, విపత్తుల్లోనే ప్రజలకు అండగా ఉండాలని టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ అశ్రద్ధ, నిర్లక్ష్యం వల్లే కరోనా పెరిగిందని చంద్రబాబుతో నేతలు చెప్పారు. వసతులు లేక క్వారంటైన్ కేంద్రాల్లో ఉండేందుకు ప్రజలు ఇష్టపడటం లేదని వివిధ జిల్లాల టీడీపీ నేతలు అధినేతకు తెలియజేశారు. ఉపాధి పోయిన పేద కుటుంబాలను ఆదుకోవాలని, కోడిగుడ్లు, కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేయాలని బాబు డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. పిడుగుపాటుకు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని, ఢిల్లీలో క్వారంటైన్ పూర్తయిన తెలుగు విద్యార్ధులను రాష్ట్రానికి రప్పించాలని చంద్రబాబు కోరారు.

Updated Date - 2020-04-10T21:00:37+05:30 IST