అధికార పార్టీ ఆగడాలను ఎండగట్టండి : చంద్రబాబు
ABN , First Publish Date - 2020-10-01T18:19:54+05:30 IST
అధికార పార్టీ ఆగడాలను ఎండగట్టాలని, ముఖ్యంగా తిరుపతిలో జరుగుతున్న దారుణాలపై
తిరుపతి : అధికార పార్టీ ఆగడాలను ఎండగట్టాలని, ముఖ్యంగా తిరుపతిలో జరుగుతున్న దారుణాలపై నిలదీయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. బుధవారం జూమ్ యాప్ ద్వారా తిరుపతి నియోజకవర్గ నాయకులతో ఆయన మాట్లాడారు. మన నాయకులపై తప్పుడు కేసులు పెడుతూ వైసీపీ వాళ్లే నవ్వుల పాలవుతున్నరన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. ముందుగా తిరుపతి నియో జకవర్గ ఇన్చార్జి సుగుణ మాట్లాడుతూ.. తిరుపతిలో అభివృద్ధి కుంటిపడిపోయిందన్నారు.
టీడీపీ హయాంలో జరిగిన పనులనే నత్తనడకన చేస్తున్నారన్నారు. గరుడ వారధికి నిధులు లేవంటున్న టీటీడీ, ఇతరవాటికి మాత్రం ఇష్టమొచ్చినట్టు వెచ్చిస్తున్నారన్నారు. ప్రజలు ఎంతో అసహనంతో ఉన్నారని ఉప ఎన్నికల్లో వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. దీనికి ముందు ప్రారంభోపన్యాసంలో తిరుపతి లోక్సభ కమిటీ అధ్యక్షుడు నరసింహయాదవ్ మాట్లాడుతూ.. అందరికీ అండగా ఉంటానని, కార్యకర్తలు, నేతలకు మధ్యవారధిగా పనిచేస్తానన్నారు. కొత్తగా బాధ్యతలు ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి నుంచి బుల్లెట్ రమణ, ఊట్ల సురేంద్ర నాయుడు, ఆర్సీ మునికృష్ణ, విజయలక్ష్మికి జూమ్ యాప్ద్వారా అధినేతతో మాట్లాడే అవకాశం వచ్చింది.