ఎస్వీఆర్కు నివాళులర్పించిన చంద్రబాబు
ABN , First Publish Date - 2020-07-03T23:21:53+05:30 IST
విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకులను అలరించి, విలక్షణమైన
అమరావతి: విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకులను అలరించి, విలక్షణమైన నటనతో విశ్వనట చక్రవర్తిగా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సామర్ల వెంకట రంగారావు(ఎస్వీఆర్) గారి జయంతి సందర్భంగా ఆ తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డ, యశస్వి ఎస్వీఆర్ గారి స్మృతికి నివాళులర్పిస్తున్నాను’ అని ట్వీట్లో పేర్కొన్నారు.