Chandrababu Tour: వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపటి నుంచి చంద్రబాబు పర్యటన
ABN , First Publish Date - 2022-07-20T18:36:40+05:30 IST
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.
అమరావతి (Amaravathi): గోదావరి వరద (Godavari flood) ప్రభావిత ప్రాంతాల్లో గురువారం నుంచి రెండు రోజుల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో (కోనసీమ (Konaseema) జిల్లా, పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా) ఐదు నియోజక వర్గాలు ఆచంట, పి.గన్నవరం, రాజోల్, పాలకొల్లు, నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వరద ముంపు గ్రామాల్లో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు పర్యటనకు బయలుదేరనున్నారు. ఆయోధ్య లంక, నాగుల్లంక, మనెపల్లి, అప్పనపల్లి, రాజోల్, దొడ్డిపట్ల, అబ్బురాజుపాలెం, గంగాధర పాలెం, లక్ష్మీపురం, పొన్నపల్లి తదితర గ్రామాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది.