ఏడాదిలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తా: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-04-20T00:59:11+05:30 IST

ఏడాదిలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తా: చంద్రబాబు

ఏడాదిలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తా: చంద్రబాబు

అమరావతి: టీడీపీపై కోపంతో ఒక సామాజిక వర్గంపై కక్ష సాధిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామన్నారు. 'బాదుడే బాదుడు' నిరసనల్లో తాను పాల్గొంటానని వెల్లడించారు. మహానాడు వరకు 'బాదుడే బాదుడు' కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. మే మొదటివారంలో తన పర్యటనలు ఉంటాయన్నారు. మహానాడు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని తెలిపారు. నెలకు 2 జిల్లాల చొప్పున ఏడాదిలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తానన్నారు. 


Updated Date - 2022-04-20T00:59:11+05:30 IST