Chandrababuకు కర్ణాటక రాష్ట్రంలో భారీగా స్వాగతం

ABN , First Publish Date - 2022-07-06T22:20:01+05:30 IST

టీడీపీ మహానాడు (TDP Mahanadu)ను ఒంగోలులో అట్టహాసంగా నిర్వహించారు. ఇప్పుడు జిల్లాల వారిగా మినీ మహానాడును నిర్వహిస్తున్నారు.

Chandrababuకు కర్ణాటక రాష్ట్రంలో భారీగా స్వాగతం

మదనపల్లె: టీడీపీ మహానాడు (TDP Mahanadu)ను ఒంగోలులో అట్టహాసంగా నిర్వహించారు. ఇప్పుడు జిల్లాల వారిగా మినీ మహానాడును నిర్వహిస్తున్నారు. టీడీపీ మినీ మహానాడు బుధవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మహానాడుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) వస్తున్నారు. చంద్రబాబు నేరుగా బెంగుళూరుకు విమానంలో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మదనపల్లెకు వచ్చారు. మార్గమద్యంలో చంద్రబాబుకు కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో భారీగా స్వాగతం పలికారు. చింతామణి నుంచి తాడిగల్లు క్రాస్ వరకు ఇరువైపులా బ్యానర్లతో చంద్రబాబుకు స్వాగతం పలికారు. కర్ణాటక సరిహద్దుకు 20 కిలోమీటర్ల అవతల.. తాడిగల్లు క్రాస్ దగ్గర భారీ గజమాలతో చంద్రబాబుకు స్వాగతం పలికారు. 


మినీ మహానాడును విజయవంతం చేసేందుకు టీడీపీ నేతలు కసరత్తు చేశారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి అమరనాథరెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు, రాజంపేట టీడీపీ నాయకుడు గంటా నరహరి, మదనపల్లె టీడీపీ ఇన్‌చార్జ్‌ దొమ్మలపాటి రమేశ్‌ మినీ మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మదనపల్లె (Madanapalle) బైపాస్‌ రోడ్డు పక్కన సుమారు 45 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం నుంచి చంద్రబాబు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

Updated Date - 2022-07-06T22:20:01+05:30 IST