జగన్‌కు ఐటీ శాఖ క్లియరెన్స్ ఇవ్వడంపై స్పందించిన చంద్రబాబు

ABN , First Publish Date - 2022-01-11T23:26:01+05:30 IST

జగన్‌రెడ్డి సంస్థల్లో అక్రమ పెట్టుబడులు లేవంటూ ఐటీ శాఖ క్లియరెన్స్ ఇచిందన్న వార్తలపై చంద్రబాబు స్పందించారు. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ..

జగన్‌కు ఐటీ శాఖ క్లియరెన్స్ ఇవ్వడంపై స్పందించిన చంద్రబాబు

అమరావతి: జగన్‌రెడ్డి సంస్థల్లో అక్రమ పెట్టుబడులు లేవంటూ ఐటీ శాఖ క్లియరెన్స్ ఇచ్చిందన్న వార్తలపై చంద్రబాబు స్పందించారు. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా జగన్ రూ.1200 కోట్లు తన సంస్థల్లోకి తెచ్చుకోవడం అవినీతి కాదా? అని, ఐటీ శాఖకు ట్యాక్స్ కడితే చాలా?..అవినీతి లేనట్టేనా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖలు ఇలా వ్యవహరిస్తే అక్రమార్కులకు రాజకీయం ఒక వ్యాపారం అవుతుందన్నారు.  చట్ట సవరణల ద్వారా రాజకీయ అవినీతికి అడ్డుకట్ట వేయాలని సూచించారు. జగన్‌ది అవినీతి కాదనుకుంటే దేశంలో ఒక్క అవినీతిపరుడినీ పట్టుకోలేరని చెప్పారు. కేంద్రం కూడా ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. 






Updated Date - 2022-01-11T23:26:01+05:30 IST