చంద్రబాబు జోలికొస్తే బుద్ధి చెబుతాం
ABN , First Publish Date - 2021-09-18T08:37:32+05:30 IST
చంద్రబాబు జోలికొస్తే బుద్ధి చెబుతాం
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ల నిరసనలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్): ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడిని ఖండిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు రోడ్డపైకి వచ్చారు. జోగి రమేశ్పై కేసు నమోదుచేసి చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధ్రుతం చేస్తామని హెచ్చరించారు. తిరుపతి, చిత్తూరులలో జరిగిన ఆందోళనలలో ఎమ్మెల్సీ దొరబాబు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తిరుపతిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జోగి రమేశ్ ఫొటోను అతికించిన ఫుట్బాల్ను తొక్కుతూ తెలుగు యువత నిరసన కార్యక్రమం నిర్వహించింది. చంద్రబాబు జోలికొస్తే ఫుట్బాల్ ఆడతామని హెచ్చరించింది. ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, డాక్టర్ స్వామి పాల్గొన్నారు. కొత్తపట్నం మండల కేంద్రంలో సీఎం దిష్టిబొమ్మను దహనంచేశారు. అలాగే పశ్చిమ గోదావరిజిల్లాలో టీడీపీ నాయకులు నిరసనలు తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ వీధి రౌడీలా ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని నేతలు విమర్శించారు.