TDLP: చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం
ABN , First Publish Date - 2022-09-14T23:00:50+05:30 IST
చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన టీడీఎల్పీ (TDLP) సమావేశమైంది. ఈ భేటీలో టీడీపీ ఎమ్మెల్యేలు
అమరావతి: చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన టీడీఎల్పీ (TDLP) సమావేశమైంది. ఈ భేటీలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మొత్తం 18 అంశాలు లేవనెత్తేందుకు పట్టుబట్టాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని, పోలవరం (Polavaram), లిక్కర్ స్కామ్, నిరుద్యోగం, ప్రజాసమస్యలపై చట్టసభల్లో లేవనెత్తేందుకు టీడీపీ వ్యూహరచన చేస్తోంది. గురువారం నుంచి అసెంబ్లీ (Assembly) సమావేశాలు ప్రారంభంకాన్నాయి. సభ మొదటి రోజే 3 రాజధానుల అంశంపై లఘు చర్చ జరిగే అవకాశం ఉంది. 3 రాజధానుల అంశంపై సీఎం జగన్ (CM Jagan) పవర్పాయింట్ ప్రజంటేషన్ చేస్తారు. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యాన్ని.. ప్రజల్లోకి సమగ్రంగా తీసుకెళ్లే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది.