హత్యకు గురైన సుబ్రహ్మణ్యం భార్యకు Chandra Babu పరామర్శ
ABN , First Publish Date - 2022-05-22T21:41:09+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) హత్యకు గురైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణను ఫోన్లో పరామర్శించారు.
Andhra Pradesh: హత్యకు గురైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) ఫోన్లో పరామర్శించారు. అనంతబాబే తన భర్తను హత్య చేశాడని, టీడీపీతో పాటు దళిత సంఘాలు చేసిన పోరాటం వల్లే పోలీసులు చివరికి హత్య కేసుగా నమోదు చేశారని అపర్ణ చెప్పారు. తనను పోలీసులు తీవ్రంగా వేధించారని...ప్రభుత్వం తనను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. ఈ సమయంలో తన తరపున పోరాటం చేసిన టీడీపీ నేతలకు అపర్ణ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికీ పోలీసుల విచారణపై తనకు అనుమానాలున్నాయని...తన భర్త హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని అపర్ణ డిమాండ్ చేశారు. ధైర్యంగా ఉండాలని, అన్నివిధాలా తమ పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు అపర్ణకు భరోసా ఇచ్చారు. నిందితుడు అనంత బాబు బహిరంగంగా తిరుగుతున్నా.. పోలీసులు అరెస్టు చేయకపోవడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. నిందితులకు శిక్ష పడేవరకు టీడీపీ పోరాటం ఆగదన్నారు.