టీడీపీ నాయకులకు Chandrababu స్ట్రాంగ్ వార్నింగ్..

ABN , First Publish Date - 2022-01-08T15:27:07+05:30 IST

కుప్పం నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. కుప్పంలో టీడీపీ నాయకులకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

టీడీపీ నాయకులకు Chandrababu స్ట్రాంగ్ వార్నింగ్..

చిత్తూరు : కుప్పం నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. కుప్పంలో టీడీపీ నాయకులకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘మిమ్మల్ని నమ్ముకొని నా పరువు పోగొట్టుకున్నా. నేను వచ్చినప్పుడు నాయకులు షో చేస్తున్నారే తప్ప ప్రజల్లో ఉండటం లేదు. మీ చేష్టల వల్లే ప్రజలు మనకు దూరమవుతున్నారు. ప్రజల్లో ఉన్న నాయకులనే నేను ప్రోత్సహిస్తా. పర్సనల్ ఎజెండాలతో పార్టీకి నష్టం చేయవద్దు. కుప్పంలో పార్టీలోకి యువత రాకుండా సీనియర్లు అడ్డుకుంటున్నారు. ముప్పై అయిదేళ్లుగా మిమ్మల్నే చూస్తున్నా.. కొత్త మొహాలే కనపడటం లేదు. వంద ఓటర్లకు ఒక యూత్ పర్సన్ ని ఏర్పాటు చేస్తాం. వాలంటీర్లకి పోటీగా సేవా మిత్రలను ఏర్పాటు చేద్దాం. అధికారంలోకి వచ్చాక వాళ్లనే వాలెంటీర్లుగా మారుద్దాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - 2022-01-08T15:27:07+05:30 IST