చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-08-04T05:34:58+05:30 IST

రాష్ట్రంలో ఈ నెల7 నుంచి నిరసన దీక్షలు చేపడతామంటున్న తెలుగుదేశం పార్టీ జాతీ య అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆత్మపరిశీలన చేసుకోవాలని వైసీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి సూచించారు.

చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి
మాట్లాడుతున్న కిల్లి కృపారాణి

 వైసీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షురాలు కృపారాణి

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఆగస్టు 3: రాష్ట్రంలో ఈ నెల7 నుంచి నిరసన దీక్షలు చేపడతామంటున్న తెలుగుదేశం పార్టీ జాతీ య అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆత్మపరిశీలన చేసుకోవాలని వైసీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి సూచించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం అప్పులు చేస్తోందని.. అవసరమైతే ఇంకనూ చేస్తుందని చెప్పారు. అయినా వాస్తవాలు ప్రజలు గమనిస్తున్నారని, సీఎం జగన్మోహన్‌రెడ్డి పాలనలోనే సుప రిపాలన అందుతుందని తెలిపారు. కొవిడ్‌ మృతులకు ఫలానా అంత పరిహారం ఇవ్వాలని చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేయడం తగదని, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకువెళ్లలేకపోతున్నారని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధికోసమే టీడీపీ నిరసన దీక్షలు చేపడతామంటుందని ఎద్దేవా చేశారు. కరోనా విజృంభణ కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గిందని.. అయినప్పటికీ సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపట్లేదన్నారు. ప్రత్యేకహోదా, రైల్వేజోన్‌, స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకొనేందుకు పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీలు పోరాటం చేస్తున్నారన్నారు.ఈ సమావేశంలో పలు కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 




Updated Date - 2021-08-04T05:34:58+05:30 IST