క్వారంటైన్ నుంచే చంద్రబాబు సమీక్ష.. పార్టీ ఇంచార్జ్లకు సూచనలు
ABN , First Publish Date - 2022-01-20T03:57:53+05:30 IST
రాష్ట్రంలోని 8 నియోజకవర్గాల టీడీపీ ఇంచార్జ్లతో క్వారంటైన్ నుంచే చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాలలోని ..
అమరావతి: రాష్ట్రంలోని 8 నియోజకవర్గాల టీడీపీ ఇంచార్జ్లతో క్వారంటైన్ నుంచే చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాలలోని ఇంచార్జ్లు, కో ఆర్డినేటర్లతో చంద్రబాబు విడివిడిగా మాట్లాడారు. ఆయా నియోజవర్గాల్లోని సంస్థాగత అంశాలతో పాటు పార్టీ పోరాటాలపై లోతుగా సమీక్షించారు. పని తీరు మెరుగు పరుచుకోవాలని పలువురు నేతలకు చంద్రబాబు సూచించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందుతున్న సేవలపైనా సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన చంద్రబాబు.. చీపురుపల్లి, భీమిలి, రంపచోడవరం, నరసాపురం, గుంటూరు వెస్ట్, కోవూరు, బద్వేల్, మైదుకూరు నియోజకవర్గాలపై ఇంచార్జ్లతో మాట్లాడారు. గురువారం మరికొన్ని నియోజకవర్గాల ఇంచార్జ్లతో చంద్రబాబు మాట్లాడనున్నారు.