కార్మికులంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా: చంద్రబాబు
ABN , First Publish Date - 2020-07-14T15:12:27+05:30 IST
అమరావతి: విశాఖ సాల్వెంట్స్ ప్రమాదంపై ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.
అమరావతి: విశాఖ సాల్వెంట్స్ ప్రమాదంపై ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఫార్మాసిటీలో పేలుడు గురించి విని షాక్ అయ్యానన్నారు. ప్రమాద దృశ్యాలు భయంకరంగా కనిపించాయన్నారు. కార్మికులు అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు తెలిపారు.