ఘట్టమనేని రమేష్ మృతికి చంద్రబాబు సంతాపం

ABN , First Publish Date - 2022-01-09T14:27:22+05:30 IST

సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడైన రమేష్ బాబు (56) అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే...

ఘట్టమనేని రమేష్ మృతికి చంద్రబాబు సంతాపం

హైదరాబాద్/అమరావతి : సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడైన రమేష్ బాబు (56) అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. రమేష్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. సీనియర్ నటులు కృష్ణ గారి కుమారుడైన రమేష్ బాబు నటునిగా, నిర్మాతగా పని చేశారు. వారి కుటుంబానికి ఈ క్లిష్ట సమయం లో మనోధైర్యాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని ఓ ప్రకటనలో చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - 2022-01-09T14:27:22+05:30 IST