ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు

ABN , First Publish Date - 2021-10-25T16:16:04+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు.

ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ విమానాశ్రయంలో టీడీపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి  ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ నివాసానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు చంద్రబాబు బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి ఏపీ పరిస్థితిని వివరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నారు.


అలాగే టీడీపీ కార్యాలయం విధ్వంస ఘటనపై రాష్ట్రపతికి చంద్రబాబు బృందం ఫిర్యాదు చేయనుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ఏపీలో డ్రగ్స్‌, గంజాయి అక్రమ రవాణాపై రాష్ట్రపతికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు. టీడీపీ నేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్‌ కోరారు. మరికొందరు కేంద్రమంత్రుల్ని కూడా కలుస్తామని టీడీపీ నేతలు తెలిపారు.

Updated Date - 2021-10-25T16:16:04+05:30 IST