రాష్ట్రంలో నేటి ఈ చీకట్లకు కారణం ఎవరు?: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-04-07T22:09:25+05:30 IST
మన రాష్ట్రంలో నేటి ఈ చీకట్లకు కారణం ఎవరు? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలో విద్యుత్ కోతలు, ప్రజల వెతలపై చంద్రబాబు ట్వీట్ చేశారు.
అమరావతి: మన రాష్ట్రంలో నేటి ఈ చీకట్లకు కారణం ఎవరు? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలో విద్యుత్ కోతలు, ప్రజల వెతలపై చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీ చీకట్లోకి వెళ్లిపోయిందంటూ వాపోయారు. విద్యుత్ కోతలతో ప్రసూతి ఆసుపత్రిలో బాలింతల పరిస్థితి వివరిస్తూ చంద్రబాబు వీడియోను జత చేశారు. తీవ్ర విద్యుత్ కోతలతో జనం నరకం చూస్తున్నారని, గ్రామాల్లో అనధికార పవర్ కట్లతో అల్లాడుతున్నారని తెలిపారు. కరెంట్ లేక ప్రజలు రోడ్డెక్కుతుంటే.. వాలంటీర్లకు సన్మానం అంటూ రూ.233 కోట్లు తగలేస్తున్నారని తప్పుబట్టారు. ఈ సీఎంను నీరో కాక ఇంకేమనాలి? అని చంద్రబాబు ప్రశ్నించారు.