అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్
ABN , First Publish Date - 2021-01-24T02:53:30+05:30 IST
మాజీమంత్రి అఖిలప్రియకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలని ఆమెకు చంద్రబాబు చెప్పారు.
అమరావతి: మాజీమంత్రి అఖిలప్రియకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలని ఆమెకు చంద్రబాబు చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనా మనోనిబ్బరంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని అఖిలప్రియకు చంద్రబాబు చెప్పారు. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలు ఉన్న అఖిలప్రియకు సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేసింది. చంచల్గూడ జైలు నుంచి ఆమె విడుదలయ్యారు. రూ.10 వేల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. బెయిల్ ఆర్డర్ కాపీలను చంచల్గూడ జైలు అధికారులు ఆమె తరపు న్యాయవాదులు సమర్పించారు. అనంతరం ఆమెను జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. అఖిలప్రియకు స్వాగతం పలికేందుకు ఆమె స్వంత గ్రామం ఆళ్లగడ్డ నుంచి భారీగా టీడీపీ కార్యకర్తలు వచ్చారు. కిడ్నాప్ కేసులో అఖిలప్రియ చంచల్గూడ జైల్లో 17 రోజులుగా రిమాండ్లో ఉంటున్న విషయం తెలిసిందే.