మాజీ ప్రధాని PVకి చంద్రబాబు నివాళి

ABN , First Publish Date - 2022-06-28T18:20:12+05:30 IST

మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు(PV narasimha rao) జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు.

మాజీ ప్రధాని PVకి చంద్రబాబు నివాళి

అమరావతి: మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు(PV narasimha rao) జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) నివాళి అర్పించారు. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు అమలు చేసినా.. ప్రధానిగా ఆర్థిక సరళీకరణ విధానాల ద్వారా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించినా.. మాటల కన్నా చేతలకే ప్రాధాన్యమిచ్చిన మేధావి పీవీ నరసింహారావు’’ అని కొనియాడారు. తెలుగు వెలుగు పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి దేశసేవను స్మరించుకుంటూ ఆయన స్మృతికి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. 

Updated Date - 2022-06-28T18:20:12+05:30 IST