మాజీ సీఎం రోశయ్య పార్థివదేహానికి నివాళులర్పించిన చంద్రబాబు

ABN , First Publish Date - 2021-12-05T03:32:45+05:30 IST

మాజీ సీఎం రోశయ్య పార్థివదేహానికి నివాళులర్పించిన చంద్రబాబు

మాజీ సీఎం రోశయ్య పార్థివదేహానికి నివాళులర్పించిన చంద్రబాబు

హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పార్థివదేహానికి మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. రోశయ్య మరణాన్ని తాను జీర్ణించుకోలేక పోతున్నానని చంద్రబాబు అన్నారు. 1975 నుంచి రోశయ్యతో తనకు అనుబంధం ఉందని, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా ఆయన ఒకేలా పనిచేశారని చంద్రబాబు తెలిపారు. ప్రజల్ని చైతన్యం చేయడం కోసం ఇద్దరం అనేక నిర్ణయాలు తీసుకున్నామని, పదవులకే వన్నె తెచ్చిన నాయకుడు రోశయ్య అని చంద్రబాబు చెప్పారు. రోశయ్య స్ఫూర్తిని తెలుగు జాతి ఎప్పటికీ మరవదని, రోశయ్య భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలు బతికే ఉంటాయని, ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.

Updated Date - 2021-12-05T03:32:45+05:30 IST