అక్బర్ కుటుంబానికి.. అండగా ఉంటాం..: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-09-11T18:22:12+05:30 IST

అమరావతి: ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. రాష్ట్రంలో రోజుకో దుర్మార్గపు వార్త వినాల్సి వస్తోందని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వైసీపీ నేతల దౌర్జన్యాలపై శనివారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.

అక్బర్ కుటుంబానికి.. అండగా ఉంటాం..: చంద్రబాబు

అమరావతి:  ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. రాష్ట్రంలో రోజుకో దుర్మార్గపు వార్త వినాల్సి వస్తోందని మాజీ సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. వైసీపీ నేతల దౌర్జన్యాలపై శనివారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. కడప జిల్లా మైదుకూరులో సీఎం జగన్ రెడ్డి బంధువు తిరుపాల్ రెడ్డి.. ముస్లిం మైనారిటీ అయిన అక్బర్ బాషా భూమిని కబ్జా చేసినట్టు తెలిసిందన్నారు. ఇటీవల కొందరు పోలీసులు తమ విధుల్ని పక్కనపెట్టి సివిల్ పంచాయితీల్లో తలదూర్చడం సాధారణమైందని చెప్పారు. తిరుపాల్ రెడ్డి వర్గానికి చెందిన సీఐ.. అక్బర్‌ను స్టేషన్లో కూర్చోబెట్టి, అతని పొలంలో దౌర్జన్యంగా నాట్లు వేయించారని ఆరోపించారు.


అంతటితో ఆగకుండా ఎన్‌కౌంటర్ చేస్తానని బాధితుడిని బెదిరించడం దుర్మార్గమన్నారు. న్యాయం చేయాల్సిన పోలీసులే బాధితుడిపై దౌర్జన్యానికి దిగితే.. సామాన్యుడికి ఇక దిక్కెవరని ప్రశ్నించారు. గతంలో నంద్యాలలో సలీం కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు అక్బర్ కుటుంబం కూడా.. తాము ఆత్మహత్య చేసుకుంటామని చెబుతున్నారని తెలిపారు. అక్బర్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే అక్బర్ కుటుంబానికి న్యాయం చేసి,  బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-09-11T18:22:12+05:30 IST