Chandrababu Naidu: చంద్రబాబుకు బెంగళూరులో ఘన స్వాగతం
ABN , First Publish Date - 2022-08-25T16:34:37+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కు బెంగళూరు విమానాశ్రయంలో
బెంగళూరు, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కు బెంగళూరు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బుధవారం హైదరాబాద్ నుంచి ఆయన బెంగళూరు(Bangalore) విమానాశ్రయానికి చేరుకున్నారు. మూడు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన కోసం ఆయన వచ్చారు. చిత్తూరు(Chittoor) జిల్లాకు చెందిన మాజీ మంత్రి అమరనాథరెడ్డి, అనంతపురం జిల్లా నాయకులు పామిశెట్టి శేఖర్, రవిచంద్రబాబు, జయరాం నాయు డు, రామాంజినమ్మ, పరిమళతోపాటు పలువురు స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లాకు చెందిన నాయకులు తరలివచ్చారు. ఎయిర్పోర్టు నుంచి రోడ్డుమార్గాన కుప్పంకు బయల్దేరారు.