బుద్దా, నాగుల్ మీరా వేసిన కమిటీలను పక్కన పెట్టాలని చంద్రబాబు ఆదేశం

ABN , First Publish Date - 2021-12-22T23:50:31+05:30 IST

వివిధ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను టీడీపీ ప్రకటించింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా ఎంపీ కేశినేని నాని ఎన్నుకున్నారు.

బుద్దా, నాగుల్ మీరా వేసిన కమిటీలను పక్కన పెట్టాలని చంద్రబాబు ఆదేశం

అమరావతి: వివిధ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను టీడీపీ ప్రకటించింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా ఎంపీ కేశినేని నాని ఎన్నుకున్నారు. విశాఖ సౌత్ ఇన్‌చార్జ్‌గా గండి బాబ్జీ, మాచర్ల ఇన్‌చార్జ్‌గా జూలకంటి బ్రహ్మానందరెడ్డిని ఎంపిక చేశారు. విజయవాడ పశ్చిమ ఇన్‌చార్జ్ పదవిని బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ఆశించారు. అయితే బుద్దా, నాగుల్ మీరాకు ఇప్పటికే వేర్వేరు బాధ్యతలు ఉన్నందున పశ్చిమ బాధ్యతలను కేశినేని నానికి అప్పగించారు. డివిజన్ స్థాయి కమిటీలను నియమించుకునేందుకు కేశినేనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. బుద్దా, నాగుల్ మీరా వేసిన కమిటీలను పక్కన పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు.

Updated Date - 2021-12-22T23:50:31+05:30 IST