-
-
Home » Andhra Pradesh » Chandrababu-MRGS-AndhraPradesh
-
APలో దొంగల రాజ్యం నడుస్తోంది: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-05-12T00:50:16+05:30 IST
ఏపీలో దొంగల రాజ్యం నడుస్తోందని టీడీపీ అధినే చంద్రబాబు (Chandrababu) ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో
చిత్తూరు: ఏపీలో దొంగల రాజ్యం నడుస్తోందని టీడీపీ అధినే చంద్రబాబు (Chandrababu) ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. త్రీకేర్ ప్రాజెక్ట్ను పూర్తిగా నిర్వీర్యం చేశారని, రైతులకు రుణాలు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ సీఎం జగన్ అరాచకానికి తెరలేపారని దుయ్యబట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి సీఎంని చూడలేదన్నారు. మోటర్లకు మీటర్లు బిగిస్తే రైతు పరిస్థితి అగమ్యగోచరమేనని తెలిపారు. ప్రజల కోసం ఎలాంటి కేసులనైనా ఎదుర్కోవడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఏపీ మరో శ్రీలంక కావడానికి ఎంతో సమయం పట్టదన్నారు. ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.